Monday, 31 August 2026
Telugu Daily
Header
BREAKING

కాసు మహేష్ రెడ్డి సమక్షంలో  వైసిపిలో చేరిన టిడిపి కార్యకర్తలు 

దాచేపల్లి. ఆగస్టు 31 

గురజాల నియోజకవర్గంలో  దాచేపల్లి నగర పంచాయతీకి చెందిన ముఖ్య నాయకుడు మశ్యం శ్రీనివాసరావు టీడీపీ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.​కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకే తాను పార్టీ మారినట్లు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వైఎస్సార్‌సీపీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం, గౌరవం లభిస్తుందని, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Share this Article:

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!